Homeటాప్ స్టోరీస్మెగాస్టార్ ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన `ఆహా`

మెగాస్టార్ ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన `ఆహా`

మెగాస్టార్ ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన `ఆహా`
మెగాస్టార్ ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన `ఆహా`

డిజిటిల్ వ‌ర‌ల్డ్ లోకి కొత్త‌గా ఎంట‌రైన డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ `ఆహా`. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్‌, మ్యాక్స్ ప్లేయ‌ర్‌. జీ5, ఆల్ట్ బాలాజీ వంటి డిజిట‌ల్ ఫ్లాట్ ఫామ్స్‌కి ధీటుగా ప్రేక్ష‌కుల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని అందించాల‌ని ప్లాన్ చేశారు. ఇందు కోసం అన్నింటికీ భిన్నంగా టాప్ సెల‌బ్రిటీలతో టాక్ షోలు, మూవీస్‌, వెబ్ సిరీస్ అందిస్తున్నారు.

ఇందులో భాగంగా స‌మంత హోస్ట్‌గా సామ్ జామ్ పేరుతో సెల‌బ్రిటీల టాక్ షోని ప్రారంభించారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్న ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేప‌థ్యంలో ఆహా అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో మెగా అభిమానుల‌కు గురువారం సారీ చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది. ఆహా టీమ్ అల్లు అర‌వింద్ త‌రుపున సారీ ఎందుకు చెప్పారు? .. అలా చెప్పాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది? అన్న‌ది టాలీవుడ్‌తో పాటు సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

- Advertisement -

`ఆహా` కోసం సామ్ జామ్ పేరుతో సెల‌బ్రిటీల టాక్ షోల‌ని స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ చిట్ చాట్‌ని కూడా షూట్ చేశారు. ఈ సంద‌ర్భంగా వ‌దిలిన ప్రోమోలో అల్లు అర్జున్‌ని మెగాస్టార్‌గా సంబోదించ‌డం వివాదానికి ప్ర‌ధాన కార‌ణంగా నిలిచింది. అల్లు అర్జున్‌ని మెగాస్టార్ అంటూ సంబోధించ‌డం ఏంట‌ని మెగా ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేయ‌డం మొద‌లైంది. దీంతో జ‌రిగిన త‌ప్పిదాన్ని గ‌మ‌నించిన ఆహా టీమ్ వెంట‌నే రంగంలోకి దిగి మెగా ఫ్యాన్స్‌కి సారీ చెప్ప‌డం ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All