కరోనా వైరస్ కొత్త అడుగులు వేయిస్తోంది.. కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టేలా చేస్తోంది. సరికొత్త ఆవిష్కరణలకు పురికొల్పుతోంది. ఈ కష్ట కాలంలో బ్రతుకుబండి నడవాలంటే సృజనాత్మకంగా ఆలోచించాల్సిందే. లేదంటే మనుగడ కష్టంగా మారుతోంది. దీన్ని గమనించిన ప్రతి రంగం కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టింది.
అల్లు అరవింద్ కూడా ఆహా కోసం కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఆహా కోసం కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టిన అల్లు అరవింద్ స్క్రిప్ట్ స్క్రీనింగ్ కోసం కొత్తగా ఓ బ్యాచ్ ని అపాయింట్ చేసుకున్న ఆయన న్యూ రైటర్స్ కోసం ప్రత్యేకంగా జూమ్ యాప్ లో స్టోరీస్ వినాలని ప్లాన్ చేస్తున్నారట.
జూమ్ యాప్ తో పాటు గూగుల్ మీట్ ని కూడా వినియోగిస్తున్నారట. యువ రచయితలు ఈ యాప్ ల ద్వారానే స్టోరీ నరేషన్ చేయాలని అల్లు అరవింద్ ఏర్పాట్లు చేయించినట్టు తాజా అప్ డేట్.
- Advertisement -