యంగ్ హీరో అడివి శేష్ కు డెంగ్యూ సోకింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డెంగ్యూతో అడివి శేష్ బాధపడుతుండగా రెండు రోజుల క్రితం బ్లడ్ ప్లేట్ లెట్స్ బాగా పడిపోయాయట. దీంతో ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. ఈ నెల 18న హాస్పిటల్ లో అడివి శేష్ చేరినట్లు తెలుస్తోంది.
ఆయన పీఆర్ టీమ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. “వైద్యుల బృందం అడివి శేష్ కు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆయన పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్యం విషయంలో ఏదైనా సమాచారం అధికారికంగా ఇవ్వబడుతుంది” అని పిఆర్ టీమ్ తెలియజేసారు.
ప్రస్తుతం అడివి శేష్ మేజర్ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెల్సిందే. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదే కాకుండా నాని నిర్మాణంలో హిట్ 2 చిత్రంలో కూడా అడివి శేష్ నటిస్తున్నాడు. గూడచారి సీక్వెల్ ప్రీప్రొడక్షన్ దశలో ఉంది.