
రాధే శ్యామ్ మూవీ తో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్..ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ 3డీ ఫార్మాట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కృతి సనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈమూవీని రామాయణ ఇతిహాసం ఆధారంగా మోడ్రన్ రామాయణంగా అత్యంత భారీ స్థాయిలో భారతీయ తెరపై కనీ వినీ ఎరుగని విధింగా తెరకెక్కిస్తున్నారు.
గ్రాఫిక్స్ ప్రధానంగా రూపొందుతున్న ఈ మూవీలో లంకాధిపతి రావణ్గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తాజా సమాచారం మేరకు ‘ఆదిపురుష్’ చిత్రాన్ని 3డిలో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
రూ. 400 కోట్లు భారీ బడ్జెట్తో టి – సిరీస్ బ్యానర్పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్ మరియు రాజేష్ నాయర్ కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారు.