Homeటాప్ స్టోరీస్క్లైమాక్స్ షెడ్యూల్ ను మొదలుపెట్టేసింది ఆది పురుష్

క్లైమాక్స్ షెడ్యూల్ ను మొదలుపెట్టేసింది ఆది పురుష్

క్లైమాక్స్ షెడ్యూల్ ను మొదలుపెట్టేసింది ఆది పురుష్
క్లైమాక్స్ షెడ్యూల్ ను మొదలుపెట్టేసింది ఆది పురుష్

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సినిమాల మధ్య జగ్లింగ్ చేస్తున్నాడు. అటు ఆది పురుష్, ఇటు సలార్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. సలార్ షెడ్యూల్ ను పూర్తి చేసిన ప్రభాస్ ఇప్పుడు ఆది పురుష్ షూటింగ్ కు షిఫ్ట్ అయ్యాడు. ముంబైలో ఆది పురుష్ కు సంబంధించిన క్లైమాక్స్ షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్ నెల రోజులు సాగుతుందని సమాచారం.

ఈ షెడ్యూల్ లో చిత్ర క్లైమాక్స్ ను పూర్తి చేస్తారని వినికిడి. ఆది పురుష్ రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న మైథలాజికల్ డ్రామా. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తాడు. ఇక సీతగా కృతి సనన్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు.

- Advertisement -

లేటెస్ట్ మోషన్ పిక్చర్ టెక్నాలజీ ఉపయోగించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఓం రౌత్. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను అక్టోబర్ 22న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి చిత్ర షూటింగ్ ను కూడా పూర్తి చేయాలని అనుకుంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All