Homeటాప్ స్టోరీస్ఆడవాళ్లు మీకు జోహార్లు పబ్లిక్ టాక్

ఆడవాళ్లు మీకు జోహార్లు పబ్లిక్ టాక్

adavallu meeku joharlu talk

శర్వానంద్, రష్మిక జంటగా ఆడవాళ్లు మీకు జోహార్లు అనే చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయగా.. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. గత వారమే విడుదల అవ్వాల్సి ఉండగా..భీమ్లా నాయక్ రిలీజ్ కారణంగా ఈరోజు కు వాయిదా పడింది. పాజిటివ్ బజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది..ప్రేక్షకులు ఏమంటున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియా లో కంటే ఓవర్సీస్ లో ముందుగానే షోస్ పడడంతో సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నారు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఫస్ట్ హాఫ్ సాఫీగా సాగిపోయిందని, సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ సీన్స్ ఎక్కువయ్యాయని అంటున్నారు. దేవి శ్రీ మ్యూజిక్ మరోసారి నిరాశ పరిచిందని..స్క్రీన్ ప్లే కూడా ఏమాత్రం బాగాలేదని అంటున్నారు. శర్వానంద్ – రష్మిక ల మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయని అంటున్నారు. సెకండ్ హాఫ్ లో కామెడీ డోస్ పెంచితే బాగుండని కామెంట్స్ వేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఫ్యామిలీ చూడదగ్గ చిత్రమని చెపుతున్నారు. ప్రస్తుతం మాత్రం సినిమా కు మిక్సిడ్ టాక్ నడుస్తుంది. పూర్తి రివ్యూస్ వస్తే కానీ సినిమా హిట్ ..ఫట్ అనేది చెప్పలేం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All