కరోరా విళయాన్ని సృష్టిస్తున్నా కొంత మంది స్టార్స్ ఎంత మాత్రం తగ్గడం లేదు. కరోనా కి ఎదురెళ్లి తాము అంగకరించిన చిత్రాల్ని పూర్తి చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్లో కన్నడ హీరో సుదీప్ తను నటిస్తున్న `ఫాంటమ్` చిత్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. త్వరలో మరో కన్నడ హీరో ఉపేంద్ర తెలుగు సినిమా కోసం హైదరాబాద్ లో షూటింగ్ చేయబోతున్న విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే హాట్ హీరోయిన్ ఆదా శర్మ కూడా ఈ జాబితాలో చేరింది. `క్షణం`, కల్కీ చిత్రాల తరువాత తెలుగులో మరో చిత్రాన్ని అంగీకరించని అదా శర్మ తాజాగా మరో చిత్రాన్ని అంగీకరించింది. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ పోమవారం నుంచి ప్రారంభం అవుతోంది. శ్రీ కృష్ట క్రియేషన్స్ బ్యానర్పై గౌరీ కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ద్వారా విప్రా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంజయ్, భాసుశ్రీ, అభయ్, హరితేజ, అక్షిత శ్రీనివాస్, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రోజు మొదలైన ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొత్తం 10 రోజుల పాటు జరగనుందని తెలిసింది. సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆదా శర్మ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారు.