కరోనా వైరస్ దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమవుతున్నారు. కానీ కొంతమంది మాత్రం కావాలనే ఇలా నుండి బయటికి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి వారికి అవగాహన కల్పించడం కోసం మరియు ఎంతో కొంత వినోదం కలిగించడం కోసం సినిమా సెలబ్రిటీలు అందరూ తమ సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. అందాల భామ అదా శర్మ కూడా పియానో వాయిస్తూ తన అభిమానులను ఇంటి దగ్గరే ఉండమనీ… బయట కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కృషి చేయాలని కోరుతున్నారు. ఇక తాజాగా అదా శర్మ పియానో వాయిస్తూ “బితోవెన్ సింఫనీ” మ్యూజిక్ ప్లే చేసారు.
నేటి వరకు ఆదా శర్మ మంచి నటి అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు తను ఒక మంచి మ్యూజిషియన్ అని కూడా ఆమె నిరూపించుకున్నారు. పైగా అసలే చిన్న పిల్ల కాబట్టి చిన్న చిన్న బట్టలేసుకుని ఆమె అలా పియానో వాయిస్తుంటే…. ఒకవైపు అందం ఒకవైపు సంగీతం అభిమానులకి చూడడానికి రెండు కళ్లు సరిపోవడం లేదు.
ఏది ఏమైనా ఇప్పటి వరకు మన దగ్గర ముక్కు పిండి టికెట్ డబ్బులు వసూలుచేసి అందించిన సినిమా తారలు కరోనా వైరస్ ఎఫెక్టుతో మనల్ని ఉచితంగా ఎంటర్టైన్ చేస్తున్నారు. పనిలో పనిగా కరోనా వైరస్ పై ప్రచారం కల్పిస్తూ అభిమానులను కూడా పెంచుకుంటున్నారు.
What is everyone doing at home ? Here’s some entertainment for the day ♥️ pic.twitter.com/Kfb3iQvdCy
— Adah Sharma (@adah_sharma) March 24, 2020
Credit: Twitter