అందాల భామ నయనతార ఇటీవల అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ ని సందర్శించింది . పూర్తిగా బ్లాక్ డ్రెస్ లో బంగారు గుడి ని దర్శించుకున్న ఈ భామ అక్కడ స్వాంతన పొందిందట .ఇంతకీ నయనతార గోల్డెన్ టెంపుల్ కు ఎందుకు వెళ్లిందో తెలుసా ……. మానసిక ప్రశాంతత కోసం , దైనందిన జీవితంలో మార్పు కోసం దైవారాధన చేయడానికి వెళ్లిందట . సన్నిధానం లో కొంతసేపు ఆధ్యాత్మిక చింతన తో మనసుకి ప్రశాంతత చేకూరిందట .
గతకొంత కాలంగా ఈ భామ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా జీవితాన్ని గడుపుతోంది . అంతేకాదు యువ దర్శకులు విగ్నేష్ శివన్ తో సహజీవనం కూడా చేస్తోంది . అయితే ఈ భామ కోరుకున్న వాళ్ళు కొంతకాలం బాగానే ఉంటున్నారు ఆ తర్వాతే ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తున్నాయి దాంతో నయన మనసు అల్లకల్లోలం అవుతోంది . అందుకే ప్రశాంతత కోసం అమృత్ సర్ కి వెళ్లిందట నయనతార .
- Advertisement -