మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం `ఆచార్య`. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమతి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై నిరంజన్రెడ్డి, రామ్చరణ్ ఈ భారీ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీలక ఘట్టాల చిత్రీకరణ జరుగుతోంది.
ఇందులో మెగాపవర్స్టార్ రామ్చరణ్ కీలక అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రామ్చరణ్ ఈ మూవీ సెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆయన పాత్ర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కనిపించబోతోంది. దేవాదాయ భూముల స్కాం నేపథ్యంలో అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన టీజర్పై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది.
టైటిల్ మోషన్ పోస్టర్లోనే కథ ఏంటనేదానిపై హింట్ ఇచ్చిన దర్శకుడు కొరటాల టీజర్లో మరే అంశాన్ని ప్రధానంగా చూపించబోతున్నారో అని, అంతే కాకుండా ఇటీవలే సెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్చరణ్ని కూడా టీజర్ లో ప్రత్యేకంగా చూపిస్తారా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా చర్చ నడుస్తోంది. టీజర్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.