
మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచానాలు నెలకొని ఉన్నాయి. ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాబోతుంది. దీంతో సినిమా ప్రమోషన్ లలో చిత్ర యూనిట్ బిజీ గా ఉన్నారు. డైరెక్టర్ కొరటాల శివ, రామ్ చరణ్ లు వరుసగా ఇంటర్వూస్ ఇస్తూ సినిమా ఫై ఆసక్తి పెంచుతున్నారు. ఇదిలా ఉంటె ఈ మూవీ రన్ టైం 2.46 గంటలుగా ఫైనల్ చేసినట్లు సమాచారం.
ఇటీవలి కాలంలో సుమారు మూడు గంటల నిడివితో సినిమాలు రావడం ట్రెండ్ గా మారింది. హాలీవుడ్ తరహాలో తక్కువ నిడివి సినిమాలేవీ రావడం లేదు. ఆర్.ఆర్.ఆర్, పుష్ప , కేజీఎఫ్ 2 సినిమాల రన్ టైమ్ ఎక్కువే. ఇప్పుడు ఆచార్య కూడా అదే రేంజులో రన్ టైమ్ విషయంలో ఎక్కడా తగ్గలేదని సమాచారం. మరి కొరటాల ఏ మాయ చేసాడో చూడాలంటే మరో 8 రోజులు ఆగాల్సిందే.