Homeటాప్ స్టోరీస్రానా హీరోగా పాన్ ఇండియా మూవీ!

రానా హీరోగా పాన్ ఇండియా మూవీ!

రానా హీరోగా పాన్ ఇండియా మూవీ!
రానా హీరోగా పాన్ ఇండియా మూవీ!

కొత్త‌ద‌నంతో కూడిన విభిన్న‌మైన చిత్రాల్ని ఎంచుకుంటూ విల‌క్ష‌ణ పాత్ర‌ల్లో న‌టిస్తూ హీరోగా త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటున్నారు హీరో రానా. ప్ర‌స్తుతం వ‌రుస‌గా భారీ చిత్రాల్లో న‌టిస్తూ య‌మ బిఈగా వున్న రానా తాజాగా మ‌రో పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. సీహెచ్ రాంబాబు తో క‌లిసి  విశ్వ‌శాంతి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ అధినేత ఆచంట గోపీనాథ్ ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు.

ప్ర‌స్తుతం మయాళ రీమేక్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో ప‌వ‌న్‌తో క‌లిసి రానా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన త‌రువాతే ఆచంట గోపాన‌థ్‌, సీహెచ్ రాంబాబు నిర్మించ‌నున్న చిత్రం సెట్స్ పైకి రానుంద‌ట‌. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా టాప్ హీరో, దేవుడు, ఈ వీవీ స‌త్య‌నారాయ‌ణ డైరెక్ష‌న్‌లో `జంబ‌ల‌కిడిపంబ‌`,  రాజేంద్ర‌ప్ర‌సాద్ హీరోగా `ఇద్ద‌రు పెళ్లా ముద్దు పోలీస్‌` వంటి సినిమాల‌ని ఆచంట గోపీనాత్ నిర్మించారు. న‌య‌న‌తార న‌టించిన త‌మిళ చిత్రం `ఇమైక్క నోడిగ‌ల్‌` చిత్రాన్ని `అంజ‌లి సిబిఐ`గా విడుద‌ల చేశారు.

- Advertisement -

కొంత విరామం త‌రువాత రానా హీరోగా భారీ పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ `ప్ర‌స్తుతం రానా చేస్తున్న సినిమా పూర్త‌యిన త‌రువాత మా సినిమా వుంటుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందించ‌నున్న సినిమా ఇది. క‌థ ఫైన‌ల్ అయంది. క‌థ‌, క‌థ‌నం, హీరో పాత్ర చిత్ర‌ణ కొత్త‌గా వుంటాయి. ద‌ర్శ‌కుడు, సాంకేతిక నిపుణులు, ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తాం` అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All