Homeటాప్ స్టోరీస్కాకినాడలో ఆమిర్ ఖాన్ కు ఏం పని?

కాకినాడలో ఆమిర్ ఖాన్ కు ఏం పని?

కాకినాడలో ఆమిర్ ఖాన్ కు ఏం పని?
కాకినాడలో ఆమిర్ ఖాన్ కు ఏం పని?

బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్ ఖాన్ కాకినాడ చేరుకున్నాడు. తన తర్వాతి చిత్రం లాల్ సింగ్ చద్దా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. లడఖ్ లో రీసెంట్ గా భారీ షెడ్యూల్ ను పూర్తి చేసారు. ఆ షెడ్యూల్ లో ఆమిర్ ఖాన్ తో పాటు నాగ చైతన్య కూడా నటించాడు. ఇక ఇప్పుడు తర్వాతి షెడ్యూల్ కోసం ఆమిర్ ఖాన్ కాకినాడ చేరుకున్నాడు. ఒక వారం పాటు కాకినాడలోనే షూటింగ్ జరుగుతుంది.

ఈ సినిమాలో నాగ చైతన్య కుటుంబం రొయ్యల బిజినెస్ చేస్తారు. బాల పాత్రను పోషిస్తున్నాడు చైతన్య. కథ ప్రకారం బాల కుటుంబాన్ని లాల్ సింగ్ కలుసుకోవాలి. అందుకోసం కాకినాడ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

- Advertisement -

లాల్ సింగ్ చద్దాలో హీరోయిన్ గా కరీనా కపూర్ నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ అతిత్వరలోనే పూర్తి కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All