శర్వానంద్ – రష్మిక జంటగా కిషోర్ తిరుమల డైరెక్షన్లో ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. మార్చి 04 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కుటుంబ సమేతంగా అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగేలా ఈ చిత్రానికి క్లీన్ ‘యు’ (U) సర్టిఫికేట్ లభించింది. రిలీజ్ కు దగ్గర పడుతుండడం తో చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేసి ఆసక్తి రేపారు.
ఖుష్బు – రాధిక శరత్ కుమార్ – ఊర్వశి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వెన్నెల కిషోర్ – రవిశంకర్ – సత్య – ప్రదీప్ రావత్ – గోపరాజు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు ఎంతోగానో ఆకట్టుకోవడం తో ప్రేక్షకులు , అభిమానులు సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.
- Advertisement -
- Advertisement -