Homeటాప్ స్టోరీస్మార్చి 15న విడుదలవుతున్న 'ఆ నిమిషం'

మార్చి 15న విడుదలవుతున్న ‘ఆ నిమిషం’

aa nimisham movie get release dateవేంకటేశ్వర డిజిటల్ మూవీస్ పతాకం పై నూతన నటీనటులను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ బండారు హరితేజ నిర్మించిన “ఆ నిమిషం” సినిమా మార్చి 15న రిలీజ్ అవుతున్న సందర్భంగా ఫిలిం చాంబర్ లో మీడియా సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో నటుడు రవిప్రకాష్, చిత్ర దర్శకుడు కళా రాజేష్,చిత్ర హీరో ప్రసాద్ రెడ్డి,హీరోయిన్ రేణుక,డి.ఓ.పి. షరీఫ్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నజీర్,వినోద్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కళా రాజేష్ మాట్లాడుతూ: అడపిల్లని స్వాగతించండి వారిని సంరక్షించండి ఆడపిల్ల ఏ దేశానికైనా నిజమైన ఆస్తి. అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాని రూపొందించడం జరిగింది.

 

- Advertisement -

నేడు ఆడపిల్ల అంటే పడక సుఖానికి, పరపతి కోసమే అన్నట్లు చూస్తున్న వాళ్ళు ఆడపిల్ల పుడితే పురిటీలోనే గొంతు నొక్కుతున్నారు. ఆడపిల్లల బర్త్ రేటు గణనీయంగా తగ్గుతుంది. సమాజంలో ఎన్నో మార్పులొస్తున్న కూడా అడపిల్లని పురిటీలోనే చంపేయడం అనేది చాలా దారుణం.పరిస్థితులు ఇలాగే కొనసాగితే  సమాజానికి భవిష్యత్ అనేది ఉండదు.  విద్యా సంస్థలలో పనిచేస్తున్న నేను నా మిత్రులు కలసి ఈ సినిమా ని నిర్మించడం జరిగింది.మార్చి 15న రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాము అన్నారు.

నటులు రవి ప్రకాష్ మాట్లాడుతూ: ఈ సినిమా కాన్సెప్ట్ బాగింది.ట్రైలర్స్ బాగున్నాయి. దర్శకుడు నిర్మాత అంతా కొత్త వారు అయినా… మంచి కథతో నేడు సమాజం ఎదుర్కొంటున్న బర్నింగ్ పాయింట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు.బేబీ రోహి సంజన, బేబీ నన్నీనటన ఆకట్టుకుంటుంది.  మార్చి 15న విడుదలవుతున్న ఈ సినిమా మంచి హిట్ అయ్యి చిత్ర బృందానికి మంచి పేరు రావాలని కోరుకొంటున్నాను అని అన్నారు. మా తొలి ప్రయత్నం సక్సెస్ కావాలని సినిమా ఘన విజయంసాధించాలని హీరో ప్రసాద్ రెడ్డి చెప్పారు.మిగతా వారు చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.

 

ప్రసాద్ రెడ్డి, రాణి శ్రీ, రేణుక,బేబీ రోహి సంజన, బేబీ నన్నీ, నాగబాబు, శ్రీదేవి ముఖ్య నటీనటులు గా నటించిన ఈ చిత్రానికి   మ్యూజిక్: కున్ని గుడిపాటి, సినిమాటోగ్రఫీ:వై.ప్రసాద్

ఎడిటర్:డాలి శేఖర్

నిర్మాత: బండారు.హరితేజ

దర్శకత్వం: కళా రాజేష్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All