యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో భారీతీయ సినీ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎంతో భవిష్యత్తు వున్న యంగ్ హీరో ఇలా హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం ఏంటని అంతా షాక్కు గురయ్యారు. బాలీవుడ్లో వున్న నెపోటిజమ్, మాఫియా కారణంగానే సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్నాడంటూ నెటిజన్స్ బాలీవుడ్ స్టార్స్ని అన్ ఫాలో చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత నుంచి బాలీవుడ్లో ఒక్కో స్టోరీ బయటికి వస్తోంది.
తాజాగా దిగ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ బాలీవుడ్లో వున్న నెపోటిజమ్పై సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్లో తనపై కుట్ర జరుగుతోందని తాజాగా వెల్లడించారు. కొందరు పనిగట్టుకుని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రెహమాన్ స్వరాలు త్వరగా ఇవ్వరని, ఆయన వద్దకు వెళ్లకండని, చాలా మంది దర్శక నిర్మాతల్ని తన వద్దకు రాకుండా తప్పుదారి పట్టిస్తున్నారని ఈ సందర్భంగా రెహమాన్ వెల్లడించడం సంచలనంగా మారింది.
రెహమాన్ సంగీతం అందించిన చిత్రం `దిల్ బెచారా`. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి చిత్రం ఇది. ఈ చిత్రానికి కూడా రెహమాన్ని తీసుకోవద్దని దర్శకుడికి కొంత మంది చెప్పినట్టు స్వయంగా దర్శకుడు ముఖేష్ చబ్రా వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.