Homeటాప్ స్టోరీస్50 కోట్ల నష్టం బయ్యర్లకు

50 కోట్ల నష్టం బయ్యర్లకు

50 crores loss for NTR kathanayakudu ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం 50 కోట్ల నష్టాన్ని మిగిల్చింది బయ్యర్లకు . నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మించిన ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే . ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది అయితే కలెక్షన్లు మాత్రం ఘోరంగా వచ్చాయి . ఎన్టీఆర్ బయోపిక్ కావడంతో బయ్యర్లు పోటీపడి ఈ సినిమాని కొన్నారు 70 కోట్లకు అయితే ఇప్పటివరకు వచ్చింది కేవలం 20 కోట్లు మాత్రమే ! అంటే అందరికీ కలిపి 50 కోట్ల నష్టం అన్నమాట .

దాంతో ఆ బయ్యర్లని ఆదుకోవడానికి బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది . ఫిబ్రవరి 14 న ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కాగా ఆ సినిమాని డబ్బులు తీసుకోకుండా రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నాడట బాలయ్య . ఇలా చేయడం వల్ల బయ్యర్లకు కొంతలో కొంత న్యాయం చేసినట్లు అవుతుంది , ఒకవేళ ఎన్టీఆర్ మహానాయకుడు పెద్ద హిట్ అయితే ఎలాగూ కాసుల వర్షం కురుస్తుంది కాబట్టి అప్పుడు పంపకాల విషయం చూసుకుంటారట .

- Advertisement -

English Title: 50 crores loss for NTR kathanayakudu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All