Homeటాప్ స్టోరీస్మాస్ ఎంబీ సోమవారాలు.. 5 రోజులు, 5 పాటలు

మాస్ ఎంబీ సోమవారాలు.. 5 రోజులు, 5 పాటలు

మాస్ ఎంబీ సోమవారాలు.. 5 రోజులు, 5 పాటలు
మాస్ ఎంబీ సోమవారాలు.. 5 రోజులు, 5 పాటలు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రమోషన్స్ విషయంలో మొదటినుండి కంప్లైంట్స్ ఉండేవి. ఒకవైపు అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో చిత్రానికి ప్రమోషన్స్ ఒక రేంజ్ లో జరుగుతుండడం, విడుదలైన పాటలు సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే. దీంతో అనిల్ రావిపూడి ప్రమోషన్స్ విషయంలో కంగారు పడకండి, ఇంకా సంక్రాంతికి కదా రిలీజ్ అంటూ సెటైరికల్ వీడియో కూడా పోస్ట్ చేయాల్సి వచ్చింది. అయితే ఒక్కసారి టీజర్ విడుదలయ్యాక పరిస్థితిలో బాగా మార్పు వచ్చింది. ఫ్యాన్స్ కు నచ్చేలా కట్ చేసిన టీజర్ వారికి ఫీస్ట్ లా అనిపించింది. అందుకే ఈ టీజర్ దాదాపు 120 గంటలకు పైగా టాప్ ప్లేస్ లోనే ట్రెండ్ అయింది. 25 మిలియన్ వ్యూస్ కు పైగా వచ్చిన ఈ టీజర్ కు 5 లక్షల లైకులు కూడా రావడం విశేషం. టీజర్ కు వచ్చిన బజ్ తో సరిలేరు నీకెవ్వరు టీమ్ సరికొత్త ఉత్సాహంతో ముందుకు వెళుతోంది.

రీసెంట్ గా మాస్ ఎంబీ మండేస్ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ను పోస్ట్ చేసి, ఏమిటో గెస్ చేయండి అంటూ ఫ్యాన్స్ ను ఊరించిన సంగతి తెల్సిందే. హ్యాష్ ట్యాగ్ ను బట్టి చూస్తే ప్రతి సోమవారం ఈ చిత్రానికి సంబంధించిన ఏదొక అప్డేట్ వస్తుందని అర్ధమైపోతూనే ఉంది. కొద్దిసేపటి క్రితం సరిలేరు నీకెవ్వరు టీమ్, ఆ హ్యాష్ ట్యాగ్ కు అర్ధమేంటో చెప్పేసారు. డిసెంబర్ నెలలో 5 సోమవారాలు ఉన్న విషయం తెల్సిందే. ఈ 5 సోమవారాలు, ఒక్కో సోమవారం, సరిలేరు నీకెవ్వరు నుండి ఒక్కో పాట విడుదలవుతుంది. దీన్ని బట్టి సినిమాలో 5 పాటలు ఉంటాయని చెప్పకనే చెప్పారు. దాంతో పాటు మొదటి పాట డిసెంబర్ 2న రాబోతోందని కూడా అప్డేట్ ఇచ్చినట్లయింది. దీంతో ఇక డిసెంబర్ మొదలుకావడమేంటి, సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్లతో హోరెత్తిస్తుంది అన్నమాట.

- Advertisement -

డిసెంబర్ అంతా పాటలను వదులుతున్న తరుణంలో థియేట్రికల్ ట్రైలర్ జనవరిలోనే వస్తుందని అర్ధమైపోతుంది. దీంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి మొదటి వారంలో ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేయమని ఆర్డర్ కూడా వేసాడు. ఏదైనా ఓపెన్ గ్రౌండ్ ను చూడమని చెప్పాడు. ఈ సినిమా విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు మహేష్.

సరిలేరు నీకెవ్వరులో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే. విజయశాంతి దాదాపు 13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి ఈ చిత్రం ద్వారానే రీ ఎంట్రీ ఇస్తోంది. ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, అజయ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అనిల్ సుంకర నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దిల్ రాజు సమర్పకుడు. అనిల్ రావిపూడి దర్శకుడు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All