టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వివాదంలో చిక్కుకున్నాడు . ఇప్పటికే జి ఎస్ టి కేసు పదేళ్ల క్రితం నాటిది మహేష్ బాబు ని వెంటాడుతుండగా తాజాగా ఏషియన్ మహేష్ బాబు సినిమాస్ ( ఏ ఎం బి ) విషయంలో మరోసారి జి ఎస్ టి అధికారులు 35 లక్షలు కట్టాలని ఆదేశాలు జారీ చేసారు . ఈసారి మహేష్ బాబు కు ఎందుకు ఫైన్ వేసారో తెలుసా …….. మహేష్ బాబు కు అధునాతనమైన థియేటర్ లు ఉన్న విషయం తెలిసిందే .
ఆ థియేటర్ లలో టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి , కేంద్ర ప్రభుత్వం జి ఎస్ టి పన్ను తగ్గించినప్పటికీ మహేష్ బాబు థియేటర్ లలో మాత్రం రేట్ల ని తగ్గించలేదు దాంతో కొంతమంది జి ఎస్ టి అధికారులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన అధికారులు తనిఖీ చేసి అత్యధికంగా వసూల్ చేస్తున్నారని తేలడంతో 35 లక్షల జరిమానా విధించారు . ఈ మొత్తం మహేష్ బాబు కట్టకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసారు అధికారులు . మరి మహేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి .
English Title: 35 Lakhs Fine to Mahesh babu AMB