`సైరా` తరువాత మెగాస్టార్ చిరంజీవి మరో చిత్రాన్ని పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని నిరంజన్రెడ్డితో కలిసి రామ్చరణ్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఓ పాటతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. చిరంజీవి, రెజీనా పాల్గొనగా నైట్ ఎఫెక్ట్లో ఓ ఐటమ్ సాంగ్ని షూట్ చేశారు. ఈ పాటలో రెజీనా ఈజ్ చూసి మెగాస్టార్ ఫిదా అయిపోయారట.
సినిమాలో ఈ పాట ప్రత్యేకంగా వుంటుందట. ప్రస్తుతం రాకెట్ స్పీడుతో షూటింగ్ జరపుకుంటున్న ఈ సినిమా గురించి మరో స్పెషల్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఈ చిత్రం కోసం భారీగానే ఖర్చు చేస్తున్న నిర్మాతలు కేవలం ఓ కాలనీ సెట్ కోసం ఏకంగా 20 కోట్లు ఖర్చు చేస్తున్నారట. దీనితో పాటు ఓ టెంపుల్ని కూడా సెట్ వేయాలని భావిస్తున్నారట. సినిమా హై రేంజ్లో కనిపించడం కోసం ఏ ఒక్క విషయాన్ని కూడా విడిచి పెట్టకుండా ఏ విషయంలోనూ రాజీపడటం లేదట.
దీంతో కేవలం కాలనీకే 20 కోట్లు ఖర్చు చేస్తే సినిమాకు ఏ రేంజ్లో ఖర్చు చేస్తున్నారా అని అంతా ఆరాతీస్తున్నారట. ఈ లెక్కన సినిమా బడ్జెట్ `సైరా`ని మించే వుండొచ్చని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇందులో చిరుకు జోడీగా త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే. చిరు 152వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం నక్సలిజమ్ నేపథ్యంలో అత్యంత శక్తి వంతంగా వుండబోతోందని ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది.