భారత బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్ ఒక్కటయ్యారు. గత కొంత కాలంగా డేటింగ్లో వుంటూ ప్రేమించుకుంటున్న ఈ లవ్ బర్డ్స్ ఫైనల్గా గురువారం మధ్యాహ్నం 1:40 గంటలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మొయినా బాద్ లో వీరి వివాహం జరిగింది. గత ఏడాది సెప్టెంబర్లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామంటూ అప్పుడే ప్రకటించేశారు.
అన్నట్టుగానే ఉగాది రోజున తమ పెళ్లి పత్రికని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు షేర్ చేశారు. కోవిడ్ కారణంగా అందరికి ఆహ్వానాలు పంపించడం లేదని స్పష్టం చేశారు. గుత్తా జ్వాల, విష్ణు విశాల్ కిది రెండవ పెళ్లి. గతంలో ఇద్దరు వేరు వేరు వ్యక్తులని వివాహం చేసుకున్నారు. అయితే ఆ తరువాత జీవిత భాగస్వాములతో మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారు.
గత కొంత కాలంగా 2010లో రజనీ నటరాజన్ను పెళ్లి చేసుకున్న విష్ణు విశాల్ 2018లో ఆమెకు విడాకులిచ్చేశాడు. ఇక భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ని 2005లో వివాహం చేసుకున్న గుత్తాజ్వాల 2011లో అతనితో విడిపోయింది. విశాల్ సోదరి పెళ్లి వేడుకల్లో తొలిసారి గుత్తా జ్వాలతో విష్ణు విశాల్తో పరిచయం ఏర్పడింది. అది ఆ తరువాత ప్రేమకు దారితీసింది.