బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి బాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎంతో భవిష్యత్తు వున్న యంగ్ టాలెంటెడ్ హీరో అనుమానాస్పదంగా మృతి చెందడంపై దేశ వ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అతని మైనపు ప్రతిమని లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిష్టించాలని, తద్వారా అతను ప్రపంచానికి సజీవంగా వున్నాడన్న అనుభూతిని కరలిగించిన వారవుతారని 50 వేల మంది ఓ ఫిర్యాదు చేశారు.
అయితే దీనిపై ఇంత వరకు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వర్గాల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే వెస్ట్ బెంగాల్లోని అస్సన్సోల్లో సుశాంత్ మైనపు ప్రతిమని గురువారం ఆవిష్కరించారు. బ్లూ జీన్స్ షర్ట్.. బ్లాక్ క్యాజువల్ …వైట్ షూస్ లో స్టైల్గా తన సహజమైన చిరునవ్వుని చిందిస్తూ ఓ కుర్చీని పట్టుకుని సుశాంత్ నిలుచున్నట్టుగా వున్న వ్యాక్స్ స్టాచ్యూ ఆకట్టుకుంటోంది.
అయితే సుశాంత్ వ్యాక్స్ స్టాచ్యూని చూసిన వారంతా మేకర్పై విమర్శలు గుప్పిస్తున్నారు. స్టాచ్యూ సుశాంత్ని పోలి లేదని, చాలా తొందరగా చేయాలనే ఆత్రుతలో చేసినట్టుగా వుందని, సుశాంత్ క్రేజ్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలన్న తొందరలో మేకర్ జాగ్రత్తలు పాటించలేదని నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.